లెక్చరర్లపై ఒయులో దాడి: సీమాంధ్రలో పెల్లుబుకుతున్న నిరసనలు

Osmania University
విజయవాడ: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సీమాంధ్ర అధ్యాపకులపై దాడిని వ్యతిరేకిస్తూ సోమవారం సీమాంధ్రలో నిరసన పెల్లుబుకుతోంది. సోమవారంనాడు విద్యాసంస్థలను మూసేశారు. ఓయూ ఘటనను నిరసిస్తూ సీమాంధ్రలో నిర్వహిస్తున్న విద్యాసంస్థల బంద్‌ విజయవాడలో ప్రశాంతంగా కొనసాగుతోంది. నగరంలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సహా పలు విద్యార్థి సంఘాలు బంద్‌లో పాల్గొంటున్నాయి. బంద్‌లో భాగంగా మానవహారం, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఓయూలో దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆ సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. సీమాంధ్రలోని 14 విశ్వవిద్యాలయాల జెఎసి నాయకులు, కార్యకర్తలు విద్యాసంస్థల బంద్ ను పాటిస్తున్నారు.

తెలంగాణ వాదులు అనాగరికుల్లా ప్రవర్తిస్తూ, ఆటవిక చర్యలకు దిగుతున్నారని సమైక్యాంధ్ర ఐకాస కన్వీనరు ఎన్‌.శామ్యూల్‌, గౌరవాధ్యక్షులు పి.నరసింహారావు విమర్శించారు. ఈనెల 28న హైదరాబాద్‌ ఉస్మానియా వర్సిటీలో బీఈడీ జవాబుపత్రాల మూల్యాంకనం చేస్తున్న అధ్యాపకులపై దాడిచేయడం హేయమైన చర్యగా అభివర్ణించారు. అలాగే ఆదివారం నల్గొండలోని మహాత్మాగాంధీ వర్సిటీలో అధ్యాపక పోస్టుల ఇంటర్వ్యూలకు వెళ్లిన సీమాంధ్ర అభ్యర్థులను తరిమివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రవర్తన మార్చుకోకపోతే తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. దాడులను ఖండిస్తూ సోమవారం సీమాంధ్రలోని పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీల్లో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సోమవారం నాగార్జున వర్సిటీలో పూర్తి బంద్‌కు పిలుపునిచ్చినట్లు సమైక్యాంధ్ర విద్యార్థి ఐకాస కో-కన్వీనరు మండూరి వెంకటరమణ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+