హైకమాండ్ పోటీ ఓదార్పు: వైయస్ జగన్ కు లాస్ట్ చాన్స్

YS Jagan
న్యూఢిల్లీ: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పును కౌంటర్ చేసేందుకు పోటీ ఓదార్పును చేపట్టాలని ఎఐసిసి నిర్ణయించింది. వైయస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మరణించినవారి కుటుంబాలకు తానే ఆర్థిక సాయం అందించడానికి ముందుకు వచ్చింది. వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై పార్టీ అధిష్టానం తొలిసారి అధికారికంగా ప్రకటన చేసింది. ఎఐసిసి ప్రకటనను కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ మీడియా ప్రతినిధుల సమావేశంలో విడుదల చేశారు. వైయస్ తొలి వర్ధంతి వరకు వైయస్ జగన్ కు అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు ఆ ప్రకటనను బట్టి అర్థమవుతోంది. వైఎస్‌ హఠాన్మరణంతో ఆవేదన చెంది ఆత్మహత్యలు చేసుకున్న అభిమానుల కుటుంబాలను పార్టీయే ఓదారుస్తుందని, ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున పరిహారం అందిస్తుందని ప్రకటించింది.

స్థానిక ఎంపీ, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఓదార్పు కార్యక్రమం జరుగుతుందని సోమవారం విడుదల చేసిన మూడు పేరాల ప్రకటనలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి వీరప్ప మొయిలీ తెలిపారు. ఓదార్పును పార్టీయే అధికారికంగా నిర్వహిస్తున్నందున యాత్రను విరమించుకోవాలని ఈ ప్రకటన ద్వారా జగన్‌కు పరోక్షంగా సంకేతాలిచ్చింది. మొయిలీ ప్రకటనకు అనుగుణంగా నడుచుకుంటే జగన్‌ కడప లోక్‌సభ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది.అందుకు విరుద్ధంగా వ్యక్తిగత ఓదార్పు యాత్రను రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిస్తే పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించినట్లే అవుతుందని ఈ ప్రకటనలో చెప్పకనే చెప్పారు. ఈ ప్రకటన అధిష్ఠానం నుంచి వచ్చిన తొలి అధికార పూర్వక హెచ్చరిక అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+