వైయస్ జగన్ ఓదార్పు వద్దు: మంత్రి మాణిక్యవర ప్రసాద్

Manikya Varaprasad
గుంటూరు: తమ కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు జగన్‌ ఓదార్పు యాత్ర మానుకోవాలని రాష్ట్ర ప్రాథమిక విద్యా మంత్రి మాణిక్య వరప్రసాద్‌ అన్నారు. ఏఐసీసీ ప్రకటించిన రూ. లక్ష పరిహారంపై జగన్‌ సానుకూలంగా వ్యవహరించాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో జగన్ కు సూచించారు. ఏఐసీసీ నిర్ణయం, జగన్‌ ఓదార్పుయాత్ర వేర్వేరుగా ఉండడం సరికాదని మాణిక్య వరప్రసాద్‌ అభిప్రాయపడ్డారు.

ఎఐసిసి నిర్ణయం తర్వాత వైయస్ జగన్ ఓదార్పు యాత్రను వ్యక్తిగతంగా చేపట్టడం సరి కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే మైనింగ్‌ పాలసీ మార్పు కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ నినాదంతో గొంతు కలపాలని ఆయన అన్నారు. చంద్రబాబుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. మైనింగ్ విధానంపై చంద్రబాబు చేస్తున్న విమర్శలను తప్పు పట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+