వైయస్ జగన్ ఓదార్పు కథ క్లైమాక్స్ చేరిందా?

వరుసగా నాలుగోసారి సోనియా ఎఐసిసి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె శుక్రవారం అధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్ తీసుకోనున్నారు. ఈ సమయంలోనే జగన్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అధ్యక్షురాలిగా ఆమె ప్రథమ ప్రాధాన్యం వైయస్ జగన్ సమస్య పరిష్కారానికే ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది. వైయస్ జగన్ వ్యవహారం బ్లాక్ మెయిల్ పద్ధతిలో ఉందని సోనియానే కాదు, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ కూడా భావిస్తున్నారు. ఏడాది కాలంగా జగన్ వ్యవహారం నలుగుతూ వస్తోంది. దీనికి ఎలా ముగింపు పలకాలనేదే సోనియా ముందున్న ప్రశ్న.
జగన్ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. అధిష్టానాన్ని ఆయన శుక్రవారం ఓదార్పు యాత్రలో పల్లేత్తు మాట అనలేదు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆయన క్లుప్తంగా ప్రసంగించారు. ఓదార్పు యాత్రకు ఏర్పాట్లు చేసి అందులో పాల్గొంటున్న మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిపై అధిష్టానం తొలి వేటు వేస్తుందా, నేరుగా వైయస్ జగన్ పై చర్యకు ఉపక్రమిస్తుందా అనేది తేలడం లేదు. అయితే, జగన్ పై చర్య తీసుకునేందుకు మరి కొద్ది రోజులు ఆగే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications