హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్ట్స్ కళాశాల పైనుంచి దూకుతామని విద్యార్థుల బెదిరింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

APPSC
హైదరాబాద్: ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష వివాదం విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణానికి దారి తీసింది. ఇప్పటికే నలుగురు విద్యార్థులు ఆర్ట్స్ కళాశాలలోని గదిలో తమను తాము నిర్బంధించుకుని ఆమరణ నిరాహార దీక్ష సాగిస్తున్నారు. మరో నలుగురు విద్యార్థులు కూడా ఆమరణ నిరాహార దీక్షకు దిగి ఆర్ట్స్ కళాశాల భవనంపైకి ఎక్కారు. గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయకపోతే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు. దీంతో ఆర్ట్స్ కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయకపోతే తర్వాతి పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని ఒయు విద్యార్థులు హెచ్చరిస్తున్నారు. రేపు జరగబోయేది ప్రళయమని నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులంటున్నారు. కాంగ్రెసు హై కమాండ్ వెంటనే దిగి వచ్చి తమ 42 శాతం తెలంగాణ వాటాను వెంటనే తేల్చాలని వారంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పిడిన తర్వాత తమ పరీక్ష తాము నిర్వహించుకుంటామని వారంటున్నారు. ప్రభుత్వం పెడచెవిన పెడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X