హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమని అనలేదు: వికె దుగ్గల్

గడువులోగా కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని దుగ్గల్ చెప్పారు. తాము సీమాంధ్ర, తెలంగాణలోని అందరి అభిప్రాయాలు సేకరించామని, అందరికీ ఆమోదయోగ్యమైన నివేదిక ఇవ్వగలమనే నమ్మకం తమకు ఉందని ఆయన అన్నారు. తమ నివేదిక ప్రజలందరి మనోభావాలకు అనుగుణంగా ఉంటుందని ఆయన చెప్పారు. తాము తీసుకున్న అభిప్రాయాలపై చైర్మన్, సభ్యులం కలిసి చర్చించుకున్నామని ఆయన అన్నారు. అక్టోబర్ లో చివరిసారిగా మీడియాతో తమ అభిప్రాయాలను పంచుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications