హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెటిల్ మెంట్ల కోసమే సిఇవోలతో కెసిఆర్ సమావేశం: చంద్రబాబు నాయుడు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: సెటిల్ మెంట్ల కోసమే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రైవేట్ కంపెనీల సిఇవోలతో సమావేశమయ్యారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఆయన శుక్రవారం ఉదయం తెలుగుదేశం తెలంగాణ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కెసిఆర్ వ్యవహార శైలిని ఎండగట్టాలని ఆయన సూచించారు. తాను అనని మాటలను అన్నట్లుగా కెసిఆర్ ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ను కెసిఆర్ ఐ లవ్ యూ అనడం, సిఇవోలతో కెసిఆర్ అంతర్గత సమావేశం వంటి విషయాల్లో కెసిఆర్ ఆంతర్యాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. 2011కల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కెసిఆర్ పగటి కలలు కంటున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X