తెలంగాణ యాత్రకు చంద్రబాబు నాయుడు మరో ప్లాన్
తన యాత్రను అడ్డుకుంటున్నవారు 4 వేల మందికి మించి లేరనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. వారి వల్లనే చంద్రబాబు తెలంగాణ యాత్రకు ఆటంకాలు ఎదురువుతున్నాయనే అవగాహనతో ఉన్నారు. వారిని ఎదుర్కోవడం కష్టం కాదనే ఉద్దేశంతో కూడా ఉన్నారు. అందుకు దీటుగా చంద్రదళం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. ఈ దళం ద్వారా తెరాసకు చెందిన విద్యార్థులను ఎదుర్కోవాలని అనుకుంటున్నారు. ఆ దళం భద్రత మధ్య తెలంగాణలో చంద్రబాబు పర్యటించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Comments
Story first published: Friday, September 24, 2010, 10:02 [IST]