హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కె చంద్రశేఖర రావు తెలంగాణ ఎజెండా మారిందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలంగాణ ఎజెండా మారిందా? అవునంటున్నారు కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు. కెసిఆర్ తెలంగాణ ఎజెండా మారినట్లుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో పుట్టి పెరిగినవారంతా స్థానికులేనని కెసిఆర్ అన్న మాటలు ఆ అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. మొత్తంగానే తెరాస ఎజెండా మారినట్లు అనిపిస్తోందని ఆయన అన్నారు.

డిసెంబర్ 31వ తేదీ తర్వాత భూకంపం పుట్టిస్తానని అన్న కెసిఆర్ ఆ విధంగా మాట్లాడడంలోని ఆంతర్యమేమిటో అంతు బట్టడం లేదని ఆయన అన్నారు. సమైక్యాంధ్రవాది లగడపాటి రాజగోపాల్ ను కెసిఆర్ ప్రశంసించడం, ప్రవైట్ కంపెనీల సిఇవోలతో సమావేశం కావడం వంటి కారణాలు కెసిఆర్ భవిష్యత్తు కార్యాచరణను అనుమానాస్పదం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కెసిఆర్ స్థానిక ప్రకటనను ఆయన మిత్రుడు, తెలంగాణ రాజకీయ జెఎసి కన్వీనర్ కోదండరామ్ కూడా వ్యతిరేకిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X