వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ కోసం కరీంనగర్ లో విద్యార్థి ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
కరీంనగర్: తెలంగాణపై చంద్రబాబు నాయుడు మాటలకు తీవ్రంగా కలత చెందిన కరీంనగర్ కు చెందిన ఒక విద్యార్థి ఒక లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ లోని చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన అజయ్ కుమార్ అనే విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలను మభ్య పెడుతున్నారని, ఆయన మాటలు నమ్మవద్దని అన్నారు. 2011లో తెలంగాణ వస్తుందన్న కేసీఆర్ మాటలకు వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆలు లేదు....చూలు లేదు...కొడుకు పేరు సోమలింగం అన్నట్టు కేసీఆర్ వ్యవహార శైలి ఉందని దుయ్యబట్టారు. మనది ప్రజాస్వామ్య దేశమని దానికి అనుగుణంగా నడుచుకోవాలని, తెలంగాణ పగటి కలే అని బాబు చేసిన వ్యాఖ్యలకు అజయ్ మనస్థాపం చెందాడు.

గత సంవత్సరం ప్రకటించిన తెలంగాణను వెనక్కి తీసుకున్నారని, ఎన్నికల్లో అందరూ తెలంగాణ అని ఇప్పుడు మాత్రం అందరూ దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆవేదన చెందాడు. ముంగిలి దాకా వచ్చిన ప్రత్యేక రాష్ట్రాన్ని మళ్లీ మళ్లీ వెనక్కు తీసుకు వెళుతున్నారని అజయ్ తన సూసైడ్ నోట్ లో ఆవేదన చెందారు. అజయ్ తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితిలో చురుగ్గా పని చేసేవాడు. తెలంగాణ విషయం ఎప్పుడూ ముందుకొచ్చి వెనక్కు మళ్లుతుందని ఆవేదన చెందాడు. తాను చంద్రబాబు అన్న మాటలను తీవ్రంగా నొచ్చుకున్నట్టు అందులో పేర్కొన్నాడు. చివరలో జై తెలంగాణ అంటూ రాసి ముగించాడు.

కాగా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబునాయుడు మాటలకు తెలంగాణవాదులు, విద్యార్థులు చాలామంది మనస్థాపం చెందారు. కొందరు నిరసన తెలిపారు, మరికొందరు బాబు ధోరణిని దుయ్యబట్టారు. కొందరు ఆత్యహత్యకు ప్రయత్నించారు. వరంగల్ కు చెందిన బాలు అనే విద్యార్థి సైతం నిన్న ఆత్యహత్యకు ప్రయత్నించాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X