చిరంజీవి మౌనంపై ప్రజారాజ్యం క్యాడర్ ఆగ్రహం

తాజాగా, అనంతపురం జిల్లా పెనుకొండలో ప్రజారాజ్యంపార్టీ (పీఆర్పీ) నేత అశ్వర్థ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అశ్వర్థ సూసైడ్ నోటులో పేర్కొన్నాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవే సంఘటనలు ఇతర పార్టీల్లో జరిగి ఉంటే పెద్ద యెత్తున ఆందోళనలకు దిగి ఉండేవారు. కానీ, చిరంజీవి ఏ మాత్రం కదలడం లేదు. ప్రజా చైతన్య యాత్రలంటూ పర్యటనలు చేసిన చిరంజీవి పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పార్టీ కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. తన 150వ చిత్రం పనుల్లో బిజీగా ఉన్న చిరంజీవికి పార్టీని, పార్టీ కార్యకర్తలను పట్టించుకునే సమయం కూడా చిక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications