హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పండు హత్య: మహిపాల్ రెడ్డి అరెస్టు, మహేందర్ రెడ్డి పరారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Chalasani Venkateswara Rao
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు చలసాని వెంకటేశ్వర రావు అలియాస్ పండు హత్య కేసులో నిందితులు మహిపాల్ రెడ్డి, కుమార్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, మహేందర్ రెడ్డి పరారీలో ఉన్నట్లు సమాచారం. పండు హత్య కేసులో మహేందర్ రెడ్డి ప్రధాన నిందితుడని భావిస్తున్నారు. మహేందర్ రెడ్డి మహిపాల్ రెడ్డి ఒక్క వ్యక్తేనని, మహేందర్ రెడ్డే మహిపాల్ రెడ్డి అని భావిస్తూ వచ్చారు. కానీ వారిద్దరు వేర్వేరు వ్యక్తులని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

కాగా, మహేందర్ రెడ్డి అనుచరుడు బత్తినిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెబుతున్నారు. పండు హత్యపై తమకు కీలక సమాచారం లభించిందని పోలీసులు చెబుతున్నారు. భూవివాదాలే పండు హత్యకు కారణమని భావిస్తున్నారు. మహేందర్ రెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. మహేందర్ రెడ్డి నివాసంలో రక్తం మరకలు గల బనియన్ లభించడమే కాకుండా ఇంటి వద్ద రక్తం మరకలున్నాయి. ఇంటికి వెళ్లి బట్టలు మార్చుకుని మహేందర్ రెడ్డి పారిపోయాడని అనుమానిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X