కొండా సురేఖపై, వైయస్ జగన్ వర్గీయులపై వేటు తప్పదా?

ఈ స్థితిలో కచ్చితంగా, కఠినంగా వ్యవహరించాలని పార్టీ అధిష్టానం అనుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే సోనియా ఆదేశాల మేరకు డిఎస్ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీకి, సోనియాకు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడవద్దని హెచ్చరిస్తున్నారు. అలా మాట్లాడేవారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. జగన్ వర్గానికి చెందిన నాయకులపై చర్యలు తీసుకోవడానికే డిఎస్ ఈ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అందరినీ పార్టీ పరిధిలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు సాగించి, ఆ తర్వాత మాట విననివారిపై నిర్దిష్టంగా చర్యలు తీసుకోవాలనేది అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు.
ఆ కసరత్తంతా అక్టోబర్ చివరి వారం నాటికి పూర్తయ్యే అవకాశాలున్నాయి. అక్టోబర్ చివరి వారంలో వైయస్ జగన్ వర్గీయులపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రివర్గం పునర్వ్యస్థీకరణ జరుగుతుందని అంటున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన మంత్రులను తొలగించి కొత్త మంత్రివర్గాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటారు. ఈ క్రమంలోనే వైయస్ జగన్ వర్గీయులపై చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నారు. అయితే, వైయస్ జగన్ పై చర్యలు తీసుకోవడానికి ముందు ఈ చర్యలన్నీ పూర్తి కావాలనేది పార్టీ అధిష్టానం ఆలోచనగా చెబుతున్నారు. జగన్ వ్యవహారమంతా అక్టోబర్ నెలాఖరునాటికి ఓ కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications