విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తాం: హోంమంత్రి సబితారెడ్డి

కేసు నమోదుపై చాలామంది అపోహ పడుతున్నారని, లక్షలమందిపై కేసులు ఉన్నట్టు భావిస్తున్నారని అది అవాస్తవమని చెప్పారు. రాష్ట్రం మొత్తంగా చూస్తే కేవలం 1171 కేసుల్లో కేవలం 5374 మందిపైన కేసు నమోదయ్యిందని అన్నారు. రేపటినుండి కేసులు ఎత్తివేత ప్రక్రియ ప్రారంభమవుతుందని, దీనికి కనీసం రెండు నెలలు పడుతుందన్నారు. వీలైనన్ని కేసులు ఎత్తివేయాల్సిందిగా ముఖ్యమంత్రి పోలీసు అధికారులను ఆదేశించారని అన్నారు. బస్సులను తగలబెట్టడం వంటి తీవ్రమైన కేసులు తప్పితే అన్ని కేసులు ఎత్తివేతకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. సీమాంధ్రలో 189 కేసులు, తెలంగాణలో 982 కేసులు నమోదయ్యాయని ఆమె చెప్పారు.
అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఖైదీల విడుదలను చర్చించినట్లు చెప్పారు. పక్క రాష్ట్రాలు, హత్యలు, కిడ్నాప్ లు, భారీ దొంగతనాలు వంటి వారిని పక్కన పెట్టి చిన్న చిన్న తప్పులు చేసిన సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయటానికి ప్రభుత్వం సిద్ధమయింది. అంతేకాకుండా ఏడేళ్ల జైలు శిక్ష పడి ఐదేళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న మంచి ప్రవర్తన ఖైదీలను విడుదల చేస్తారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications