వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

25న సోనియా ఇంటిముందు ధర్నాకు ప్రతిపక్షాలు కలిసిరావాలి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Motkupalli Narasimhulu
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజా యుద్ద నౌక గద్దర్ కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయటాన్ని తెలుగు దేశం స్వాగతిస్తుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. తెలంగాణ కోసం గద్దర్ ఏర్పాటు చేసిన ఫ్రంట్ తో తాము కూడా కలిసి పోరాడుతామని ఆయన అన్నారు. తెలంగాణ కోసం అందరూ ఐకమత్యంతో పోరాడాలని పిలుపునివ్వడం హర్షనీయమన్నారు.గద్దర్ కొత్త ఫ్రంట్ పెట్టడం ఎవ్వరికో వ్యతిరేకమనో మరెవ్వరికో అనుకూలమో అనుకోకూడదన్నారు. తెలంగాణ సాధన కోసం ఎవరు ప్రధాన భూమికను పోషించాలనుకున్న వారు అభినందనీయులేనని అన్నారు.

తెలంగాణ పట్ల చిత్తశుద్ధితో ఉన్న అందరూ కలిసి పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని మోత్కుపల్లి చెప్పారు. తెలంగాణ కోసం కలిసి వస్తే పార్టీలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని, అప్పుడే మన తెలంగాణను మనం సాధించుకోగల్గుతామని ఆయన సూచించారు. ఈ నెల 25న సోనియాగాంధీ ఇంటిముందు ధర్నా చేయటానికిని తెలుగు దేశం పార్టీ నిశ్చయించిందన్నారు. దానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలని ఆన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X