హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మార్ అక్రమాలపై సిబిఐ ఎంక్వయిరీకి డిఎల్ రవీంద్రారెడ్డి డిమాండ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: ఏపీఐఐసి - ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంపై ప్రభుత్వం సిబిఐ ఎంక్వయిరీ వెయ్యాలంటూ మైదుకూరు ఎమ్మెల్యే డి.ఎల్. రవీంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కుంభకోణంలో చాలామంది పాత్ర ఉందని వారందరిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ కుంభకోణంలో పాలక పక్షంలోని వారితో పాటుగా ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ పాత్ర ఎక్కువగానే ఉందన్నారు. ఏపిఐఐసి, ఎమ్మార్ కుంభకోణంలో ఉన్నవారిపై ఉద్యమించడానికి పాలక పక్షం, ప్రతిపక్షమని కాకుండా ఎవరు పోరాటం చేసినా మద్దతు పలుకుతానని చెప్పారు.

ఏపీఐఐసి కుంభకోణంలో ఇరుక్కున్న ఎమ్మార్ ప్రాపర్టీస్ పై సిబిఐ ఎంక్వయిరీ వేయటంతో మాత్రమే వదిలి వేయకుండా దానిని రద్దు చేయాలన్నారు. ఎమ్మార్ కుంభకోణంలో ఇరుక్కున్న వ్యక్తికే మళ్లీ అధికారాలు అప్పగించటంపై ఆయన మండిపడ్డారు. దోషిగా ఉన్న వ్యక్తిని వెంటనే తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X