వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాక్షి టీవీ చానెల్ కథనంపై తిరగబడిన గిరిజన మహిళ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi
కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనను కొట్టినట్లు వార్తా కథనాన్ని ప్రసారం చేసిన సాక్షి టీవీ చానెల్ కథనంపై గిరిజన మహిళ లక్ష్మి ధ్వజమెత్తారు. వంతాడ మైనింగ్ ను ప్రశ్నించడానికి వచ్చిన చంద్రబాబుపై గిరిజన మహిళలు తిరగబడ్డారంటూ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి టీవీ చానెల్ ఓ వార్తా కథనాన్ని ప్రసారం చేసింది. దాన్ని లక్ష్మి తప్పు పట్టింది. సాక్షి వార్తాకథనంలో నిజం లేదని ఆమె అన్నది. కాకినాడ కలెక్టరేట్ వద్ద తెలుగుదేశం పార్టీ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆమె చంద్రబాబుతో పాటు పాల్గొన్నారు. ఆమె ధర్నా కార్యక్రమంలో మాట్లాడారు.

చంద్రబాబు తనను కొట్టలేదని, సాక్షి తప్పుగా వార్తను ప్రసారం చేసిందని ఆమె అన్నారు. కూర్చోవాల్సిందిగా తనకు చంద్రబాబు సూచన చేశారని ఆమె చెప్పారు. సాక్షి దినపత్రిక తప్పుడు వార్తలను ప్రసారం చేయడం సరి కాదని ఆమె అన్నారు. చంద్రబాబు మంచి మాటల వల్లనే తాము బాగున్నామని ఆమె చెప్పారు. కాగా, చంద్రబాబు కూడా సాక్షిపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

స్టూడియో ఎన్ లక్ష్మి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసింది. చంద్రబాబు సమావేశంలోకి వైయస్ జగన్ వర్గీయులు ప్రవేశించారని, గొడవ చేయడానికి ప్రయత్నించారని ఆ చానెల్ చెప్పింది. గొడవ చేయడం కుదరకపోవడంతో గిరిజన మహిళలు చంద్రబాబుపై తిరగబడ్డారంటూ సాక్షి తప్పుడు వార్తను ప్రసారం చేసిందని వివరించింది. అక్రమాస్తులను కాపాడుకోవడానికి సాక్షి దొంగకథనాలను ప్రసారం చేస్తోందని వ్యాఖ్యానించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X