హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీవీ లైవ్ షోలో రఘుమారెడ్డిపై చేయి చేసుకున్న తెరాస నేత సుమన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: టీవీ లైవ్ షోలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పొలిట్ బ్యూరో సభ్యుడు, విద్యార్థి విభాగం నాయకుడు బి. సుమన్ ఓ వ్యక్తిపై చేయి చేసుకోవడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ సంఘటన శుక్రవారం రాత్రి ఓ టీవీ లైవ్ షోలో జరిగింది. తెలంగాణ అమరవీరుల ఐక్య వేదిక కన్వీనర్ రఘుమా రెడ్డితో కలిసి ఆయన ఓ టీవీ లైవ్ షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తీవ్ర వాగ్వివాదం చెలరేగింది. సహనం కోల్పోయిన సుమన్ రఘుమారెడ్డిని కొట్టారు.

రఘుమారెడ్డి తెలంగాణ కోసం మరణించిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను వెంట పెట్టుకుని టీవీ లైవ్ షోకు వచ్చారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అంతకు ముందే తెరాస నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెరాస నాయకుల వల్లనే తన కుమారుడు చనిపోయాడని ఆరోపించారు. తెరాస ఇచ్చిన చెక్కులు చెల్లలేదంటూ శుక్రవారం తెరాస కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద తెలంగాణ అమరవీరుల కుటుంబాలు ధర్నా కూడా చేశాయి. ఈ వాతావరణంలో టీవీ చానెల్ లో సుమన్ కు, రఘుమారెడ్డికి మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. ఈ వివాదంలో సుమన్ రఘుమారెడ్డిపై చేయి చేసుకున్నారు. ఇద్దరూ కొట్టుకున్నారు. ఇది ఎన్టీవిలో జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X