వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శిశువు చెవులు కోసిన డాక్టర్:విశాఖలో పాప మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vishakapatanam
విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని ఓ డాక్టర్ నిర్లక్ష్యం అప్పుడే పుట్టిన బిడ్డ మరణానికి కారకుడయ్యాడు. శ్రీనివాసమూర్తి అనే వైద్యుడు లక్ష్మీ అనే మహిళకు సిజేరియన్ ఆపరేషన్ చేసి పుట్టిన బిడ్డను పురిట్లోనే చంపేశాడు. శ్రీనివాస మూర్తి విశాఖపట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడు. ఆయన ప్రభుత్వ వైద్యుడిగా ఉంటూ ఇలా ప్రయివేటు ఆసుపత్రిలో పని చేస్తూ ఇక్కడా నిర్లక్ష్యంగా ఉంటూ శిశువు ప్రాణాన్ని తీశాడు.

విశాఖపట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఉండే లక్ష్మీకి సోమవారం రాత్రి పురిటి నొప్పులు రావటంతో ఆమె భర్త మురళీ కృష్ణ మరియు బంధువులు కలిసి రైల్వే న్యూకాలనీలోని కృష్ణ మెటర్నిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సిజేరియన్ ఆపరేషన్ చేసిన డాక్టర్ ఆపరేషన్ సమయంలో నిర్లక్ష్యంతో బిడ్డ చెవులు కోశాడు. దాంతో ఆ శిశువు మరణించాడు. అయితే డాక్టర్లు ఓ చాపలో శిశువును చుట్టి అతను పుట్టగానే చనిపోయాడని, తల్లి పరిస్థితి కూడా ఆందోళనగా ఉందని చెప్పి వారిని పంపించారు.

తెల్లవారు జామున శిశువును పూడ్చి పెట్టడానికి వెళ్లిన బంధువులు శిశువు చెవులు కోసి ఉండటాన్ని గమనించి డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడని, ఆసుపత్రి ముందు శిశువు మృతదేహంతో ఆందోళన సాగిస్తున్నారు. శిశువు ప్రాణాలను బలి తీసుకున్న శ్రీనివాసమూర్తిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాల్సిందిగా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము ఆందోళన చేపట్టినప్పటికీ డాక్టర్ ఇంతవరకు బయటకు వచ్చి తమకు సమాధానం చెప్పకపోవటంపై కూడా బాధితులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు డాక్టర్ ను విచారించేందుకు ఆసుపత్రిలోకి వెళ్లారు. ఎవరినీ ఆసుపత్రిలోకి అనుమతించటం లేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X