Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యెడ్యూరప్ప బలనిరూపణకు గవర్నర్ భరద్వాజ్ మరో అవకాశం

Yedyyurappa andBhardwaj
బెంగళూర్: కర్ణాటక రాజకీయాలు మరో మలుపు తీసుకున్నాయి. అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ మరో అవకాశం ఇచ్చారు. ఈ నెల 14వ తేదీన తిరిగి మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. సోమవారం విశ్వాస పరీక్ష రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా లేదని, రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని భరద్వాజ్ చెప్పారు. విశ్వాస పరీక్షపై తనకు బిజెపి అసమ్మతి శాసనసభ్యులు ఫిర్యాదు చేసినట్లు ఆయన మంగళవారం తెలిపారు. కర్ణాటకలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్రానికి సిఫార్సు చేసిన గవర్నర్ ఈ నెల 14వ తేదీన బలనిరూపణకు మరో అవకాశం ఇస్తానని కూడా నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

కాగా, 16 మంది తిరుగుబాటు శాసనసభ్యులు తమపై వేసిన అనర్హత వేటుపై దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో యెడ్యూరప్పకు గవర్నర్ మరో అవకాశం ఇచ్చినట్లు భావిస్తున్నారు. విశ్వాస పరీక్షలో మూజవాణీ ఓటుతో నెగ్గినట్లు స్పీకర్ బోపయ్య ప్రకటించి సోమవారం సభను నిరవధికంగా వాయిదా వేశారు. వోట్లను లెక్కించకపోవడంపై ప్రతిపక్షాలు స్పీకర్ ను తప్పు పట్టాయి. ఏ సభ్యుడు కూడా మీట నొక్కలేదని స్పీకర్ చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+