టాటా ఇనిస్టిట్యూట్ పై అపోహలున్నాయి: ముఖ్యమంత్రి రోశయ్య

ముఖ్యమంత్రి రోశయ్య సోమవారం సచివాలయంలో మార్కెటింగ్, సహకార సంఘాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. 2 నెలలుగా రైతులతో సమావేశమయ్యి వారి సహకారాన్ని కోరుతున్నామని చెప్పారు. ధాన్యంను నిలువ ఉంచడానికి ఒక సంవత్సరం పాటు ప్రయివేటు గోదాములను అద్దెకు తీసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.
అలాగే 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిలువ ఉంచడానికి కావాల్సిన గిడ్డంగులను 9నెలల్లో పూర్తి చేయాలని అధికారాలను ఆదేశించినట్లు చెప్పారు. వచ్చే రబీ నాటికి 3వేల కోట్ల రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సూచించినట్లు చెప్పారు. రైల్వే సహకారం, భారత ఆహార సంస్థల సహకారాన్ని కూడా కోరనున్నట్లు చెప్పారు. పాత ధాన్యాన్ని విదేశాలకు తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. చీపురుపల్లి, కుప్పం రెప్కో ఎన్నికలను నెలలోపు నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications