హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీవీ ఆర్టిస్టులను గదిలో బంధించి చిత్రహింసలు పెట్టిన సహనటుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: హైదరాబాద్ లో ఓ టీవీ ఆర్టిస్టును సహనటుడే బంధించి చిత్రహింసలకు గురిచేసిన సంఘటన చోటు చేసుకుంది. భాస్కరన్ అనే టీవీ ఆర్టిస్టును షేక్ పేటలోని ఓ గదిలో సహనటుడు గోపాల్ రెడ్డి గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడు. దాంతో భాస్కరన్ సొమ్మసిల్లి పడిపోయాడు. భాస్కరన్ ను లోపలే ఉంచి గదికి తాళం వేసి సోమవారం ఉదయం గోపాల్ రెడ్డి బయటకు వెళ్లాడు.

అయితే మెలకువ వచ్చిన భాస్కరన్ రక్షించాలని అరవడంతో పక్కనే టీ కోట్టులో టీ తాగుతున్న పలువురు స్థానికులు గమనించి స్థానిక గోల్కొండ పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చి గది తాళం పగులగొట్టి భాస్కరన్ ను తీసుకు వెళ్లారు. అయితే ఆర్ధిక పరమైన లావాదేవిల కారణంగానే గదిలో బందించినట్లు పోలీసులు చెబుతున్నారు. తానను ఆదివారం సాయంత్రం గదికి పిలిపించుకున్నాడని, ఆ తరువాత ఆర్ధరాత్రి సమయంలో తనను చిత్రహింసలకు గురి చేసినట్టు భాస్కరన్ పోలీసులకు చెప్పాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X