బెజవాడలో వ్యాపారి కుమారుడి కిడ్నాప్: రూ.2 కోట్లు డిమాండ్

ఈ నెల 14 వ తేది గురువారం రోజున కమలేష్ ను కిడ్నాప్ చేశారు. ఆ రోజు రాత్రి కిడ్నాపర్లు ఫోన్ చేసి 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. ఈ ఫోన్ విజయవాడ పరిసర ప్రాంతాల నుండి వచ్చింది. కిడ్నాపర్లు 15, 16వ తేదీల్లో కూడా ఫోన్ చేసి డబ్బులు అడిగారు. అయితే ఆ తరువాత 17 వ తారీఖునుండి కిడ్నాపర్ల నుండి ఎలాంటి ఫోన్ లేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు మంగళవారం వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. తమకు తమ కొడుకు ముఖ్యమనే ఉద్దేశ్యంతోనే ఇన్నాళ్లు మీడియాకు, పోలీసులకు చెప్పలేదని, కాని కిడ్నాపర్ల నుండి 16వ తేదీ తరువాత ఇప్పటి వరకు ఎలాంటి ఫోన్ రాకపోవటంతో పోలీసులను అశ్రయించామన్నారు.
కాగా కిడ్నాప్ అయిన ఐదు రోజుల తర్వాత తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడం, విజయవాడ పరిసరాల్లో నుండే ఫోన్ రావటం, గత కొంతకాలంగా ప్రేమ కోసం, డబ్బుల కోసం కిడ్నాప్ గురైనట్లు నాటకాలు ఆడటం, కిడ్నాప్ కు గురైన కమలేష్ జైన్ కు పెళ్లి కాకపోవటంతో ప్రేమ వ్యవహారం కూడా ఉండిఉండవచ్చుననే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కమలేష్ జైన్ స్నేహితులను కొందరిని ఇంటరాగేట్ చేశారు. పోలీసులు తాము సేకరించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచుతున్నారు.












Click it and Unblock the Notifications