రోశయ్య చేతకాని ముఖ్యమంత్రి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వాటిని పరిష్కరించే దిశలో ఆలోచించే ప్రతిపక్షాలను అణగదొక్కుతున్నారని అరోపించారు. ప్రజల కోసం ప్రధానితో 5 నిమిషాలు కూడా అపాయింట్ మెంట్ ఇప్పించలేని ముఖ్యమంత్రి చేతగానితనం ప్రజలకు అర్థమవుతుందన్నారు. సూక్ష్మరుణ సంస్థల వేధింపుల కారణంగా ఇప్పటికే రాష్ట్రంలో పలువురు అత్మహత్య చేసుకున్నారని, ప్రభుత్వం సూక్ష్మరుణ సంస్థల విషయంలో నిర్లక్ష్యంగా ఉందన్నారు.
చంద్రబాబు నాయుడు ధర్నా మన్మోహన్ సింగ్ హైదరాబాద్ chandrababu naidu dharna manmohan singh ntr statue hyderabad
Story first published: Tuesday, October 19, 2010, 13:59 [IST]