వైయస్ జగన్ తో కలిసి రాకుంటే మట్టిలో కలుస్తారు: కొండా సురేఖ

వచ్చే ఎన్నికల్లో ప్రజల ఓటు వెయ్యాలంటే ఆనం బ్రదర్సు ప్రజల కోరిక ప్రకారం నడుచుకోవాలన్నారు. ఎక్కడైనా నాయకుల నిర్ణయంతో పనిలేదని ప్రజల నిర్ణయమే తుది నిర్ణయమని ఆమె అన్నారు. ప్రాణాలైనా అర్పించి తమ నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని నెలకొల్పుతామంటున్న ప్రజలముందు ఆనం సోదరులు నిలవలేరన్నారు. వైయస్ జగన్ ఓదార్పు యాత్రను అడ్డుకోవడానికి చూడటం వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. ఓదార్పుకు అన్ని జిల్లాల్లోకన్నా నెల్లూరులోనే ఎక్కువ ఆదరణ లభిస్తోందన్న విషయం ఆనం సోదరులు తెలుసుకోవాలని సూచించారు.
వైయస్ జగన్ ఓదార్పు యాత్రలో ప్రజా ప్రతినిధులు పాల్గొనకపోయినా ప్రజలు పెద్ద యెత్తున పాల్గొంటున్నారని, ఓదార్పు యాత్రలో పాల్గొననివారే మట్టిలో కలిసి పోతారని ఆమె అన్నారు. జగన్ కు విశేష ఆదరణ లభిస్తోందని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications