రక్త చరిత్ర భాష్యం: ఎన్టీఆర్ విలన్, వైయస్సార్ హీరో?

నిజానికి, చాలా కాలంగా ఎన్టీఆర్ కీర్తిప్రతిష్టలకు వైయస్సార్ ను అడ్డు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైయస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రచారం చేస్తూ ఎన్టీఆర్ కు ఉన్న ఆదరణను తగ్గించే ప్రయత్నాలు జరిగాయి. వైయస్సార్ వంటి నేత లేరంటూ ఆయన కుమారుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఊరూరూ తిరిగి చెబుతున్నారు. ఎన్టీఆర్ తర్వాత రాష్ట్రంలో ప్రజల ఆదరణను చూరగొన్న నాయకుడు వైయస్సార్ మాత్రమేనని చెప్పాలి. అయితే, వైయస్సార్ కు ఫాక్షనిజం మచ్చ ఉంది. రక్తచరిత్రలో ఓ ప్రధాన పాత్ర అయిన మద్దెలచెర్వు సూరికి వైయస్సార్ ఆండదండలు పుష్కలంగా ఉండేవని అంటారు. తెలుగుదేశం నాయకుడు పరిటాల రవి హత్య కూడా వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. వైయస్సార్ పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం నాయకులను ఫాక్షనిజానికి పేరు మోసిన రాజశేఖర రెడ్డి చంపిస్తున్నాడంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడ పదే పదే ఆరోపణలు చేస్తూ వచ్చారు కూడా. రామ్ గోపాల వర్మ రక్త చరిత్ర -2లో వైయస్సార్ పాత్ర ఉందా అనేది ఇప్పుడు వేసుకోవాల్సిన ప్రశ్న. వైయస్సార్ పాత్ర ఉంటే అది ఉదాత్తంగా ఉంటుందా, ఫాక్షనిజం మచ్చ ఉన్న వ్యక్తిత్వంగా ఉంటుందా అనేది కూడా చర్చనీయాంశమే. వైయస్సార్ ను మహానేతగా నిలబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఎన్టీఆర్ ను రక్త చరిత్రలో విలన్ గా చూపించారా అనేది సందేహించాల్సిన విషయం. ఆదరణ విషయంలో, ఇమేజ్ విషయంలో దివంగత నేత వైయస్సార్ కు ఎన్టీ రామారావే పోటీ. ఇది కమ్మ, రెడ్ల ఆధిపత్య వ్యవహారాలకు సంబంధించిందా అనేది కూడా చర్చనీయాంశమే.












Click it and Unblock the Notifications