కోస్తాంధ్రలో హైకోర్టు బెంచ్ కోసం ఉధృతమవుతున్న ఉద్యమం

హైకోర్టు బెంచ్ పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని మంత్రి పార్థసారథిని లాయర్లు ముట్టడించారు. తమకు వెంటనే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయంపై ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. ఆయితే అంతకుముందు లాయర్లు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని లాయక్లు ముట్టడించారు. అధికారుల జరుపుతున్న సమావేశ మందిరంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేశారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు.
కాగా ఇప్పటికే కోస్తాంధ్రలో బెంచ్ కోసం జరుగుతున్న ఉద్యమం మూడు రోజుల క్రితం ఉత్తరాంధ్రకు పాకిన విషయం తెలిసిందే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి జిల్లా లాయర్లు విశాఖలో బెంచ్ ఏర్పాటు చేయాలని మూడు రోజులుగా ధర్నా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. తాము గాంధీ చూపిన అహింసా మార్గంలో బెంచ్ కోసం పోరాడుతుంటే పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి బెంచ్ ఏర్పాటుకు సుముఖం వ్యక్తం చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications