ఆందోళన చేస్తున్న అర్చకులకు దేవుళ్ల మంత్రి గాదె వెంకటరెడ్డి హామీ

Gade Venkat Reddy
హైదరాబాద్: ఆందోళన బాట పట్టిన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల అర్చకులకు దేవుళ్ల మంత్రి హామీ ఇచ్చారు. తమకు వేతన సవరణ సంఘం (పిఆర్సీ)ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన దేవాలయాల అర్చకులు గురువారం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అర్చకుల డిమాండ్లు న్యాయమైనవేనని దేవాదాయ శాఖ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. అర్చకుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భక్తులకు ఇబ్బందులు కలిగించవద్దని ఆయన అర్చకులను కోరారు.

దేవాలయాల ఆదాయం పెరిగితే వేతనాలు పెంచడానికి తమకు ఏ విధమైన అభ్యంతరం లేదని ఆయన చెప్పారు. అర్చకుల సమస్యల పరిష్కారానికి తగిన సూచనలు చేయడానికి జస్టిస్ వెంకట్రామిరెడ్డి కమిటీని వేశారమని, ఆ కమిటీ నివేదిక రాగానే అర్చకుల సమస్యలను పరిశీలిస్తామని ఆయన చెప్పారు. అవసరమైతే కమిటీ నుంచి మధ్యంతర నివేదిక తెప్పించుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+