మీడియాతో వాదనకు దిగిన టి. సుబ్బిరామిరెడ్డి
విరాళాలు ఇచ్చిన వ్యక్తి పేరు గానీ ఆ వ్యక్తి సూచించిన పేరు గానీ పెట్టడం సంప్రదాయమని, అందుకే తాను రాజీవ్ గాంధీ పేరు సూచించానని ఆయన చెప్పారు. నటరాజుకు కళలతో సంబంధం ఉంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా కళాసేవ చేయాలనేది తన అభిమతమని ఆయన చెప్పారు. తాను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి లలిత కళాతోరణం పేరు మార్చాలని అడగలేదని, విడిగా కళాకారులకు అనువుగా ఉండే విధంగా ఆడిటోరియం నిర్మించాలని సూచించానని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు దాన్ని రాజకీయం చేశాయని, అది తనకు బాధ కలిగించిందని ఆయన అన్నారు. టీవీ9 యాంకర్ రజనీకాంత్ పై ఆవేశంగా మాట్లాడాల్సింది కాదని, అందుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన అన్నారు. మంచి పనులు చేస్తున్నప్పుడు ప్రశ్నించకూడదని ఆయన అన్నారు. టిఎస్ఆర్ పై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో మీకు తెలియదు, నేను చెప్పేది వినండి అంటూ తన వాదనను ఆయన వినిపించారు.