హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలుగువారంతా ఐక్యంగా ఉండాలి, విభేదాలు సర్దుకుందాం: చిరంజీవి

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి మరోసారి సమైక్యాంధ్ర ప్రదేశ్ గళాన్ని వినిపించారు. తెలుగువారంతా ఐక్యంగా ఉండాలని ఆయన అన్నారు. రాష్టావతరణ దినోత్సవం సందర్భంగా ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకను ఆవిష్కరించి ప్రసంగించారు. తెలుగువారిలో చిన్న చిన్న విభేదాలున్నాయని, వాటిని సర్దుకుని ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ప్రాంతీయ విభేదాలతో ప్రజలను రెచ్చగొట్టడం మంచి పరిణామం కాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ్‌ అన్నారు. రాష్ట్రావతరణ సందర్భంగా హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయజెండా ఆవిష్కరించారు. నవంబర్‌1ని విద్రోహ దినంగా పాటించాలని మంత్రులను అడ్డుకోవడం సరైన చర్య కాదని ఆయన పేర్కొన్నారు. ఆలా రెచ్చగొట్టడం పులి మీద స్వారీ చేయడమేనని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X