వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిడబ్ల్యుసిలో స్థానానికి పోటీ పడుతున్న ఎపి నాయకులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీలో అత్యున్నత నిర్ణాయక సంస్థ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లో స్థానం కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి పది మందికి పైగా నాయకులు పోటీ పడుతున్నారు. సిడబ్ల్యుసిలో రాష్ట్రం నుంచి ఇద్దరికి మాత్రమే స్థానం దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. వీరిలో ఒక నాయకుడు సీమాంధ్ర నుంచి, మరో నాయకుడు తెలంగాణ నుంచి ఉంటారని సమాచారం. సిడబ్ల్యుసి సభ్యుల సంఖ్య మొత్తం 25 ఉంటుంది. మంగళవారం ప్రారంభమవుతున్న ఎఐసిసి సదస్సులో సిడబ్ల్యుసి సభ్యుల ఎంపిక జరుగుతుంది. మొత్తం 25 మంది సభ్యుల్లో సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్ ల ఎన్నిక నామమాత్రం కాగా, 12 మందిని నామినేట్ చేస్తారు. మిగతా 11 మందికి ఎన్నిక జరగాల్సి ఉంటుంది. అయితే ఆ 11 మంది సభ్యులకు స్థానం కల్పించే విషయంపై నిర్ణయాధికారాన్ని సోనియాకే కట్టబెట్టారు. దీంతో మొత్తం సభ్యులను కూడా సోనియానే నియమిస్తారు.

సిడబ్ల్యుసిలో స్థానం కోసం తెలంగాణ నుంచి జి. వెంకటస్వామి, కె. కేశవరావు, వి హనుమంతరావు, నంది ఎల్లయ్య ప్రయత్నిస్తున్నారు. సీమాంధ్ర నుంచి నేదురుమల్లి జనార్జన్ రెడ్డి, జెడి శీలం ప్రయత్నాలు సాగిస్తున్నారు. వెంకటస్వామి ఇప్పటి వరకు సిడబ్ల్యుసి సభ్యుడిగా ఉన్నారు. వయస్సు పైబడడంతో వెంకటస్వామిని సిడబ్ల్యుసి నుంచి తప్పిస్తారని భావిస్తున్నారు. కాగా, సీమాంధ్ర నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి కూడా అదే సమస్య ఎదురవుతోంది. అకస్మాత్తుగా కేంద్ర మంత్రి పురంధేశ్వరిని సోనియా తెర మీదికి తేవచ్చునని అనుకుంటున్నారు. పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా సిడబ్ల్యుసిలో స్థానాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే, పిసిసి అధ్యక్షుడి మార్పు ఇప్పుడిప్పుడే లేకపోవడంతో ఆయనకు స్థానం లభించకపోవచ్చునని అంటున్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం లేదు. ఆయన వర్గానికి చెందిన నాయుకలెవరికీ ఆహ్వానాలు అందలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X