ప్రజలు అల్లాడుతుంటే ఓదార్పు అంటున్న జగనే తుఫానులో కొట్టుకుపోతాడు

Shankar Rao
హైదరాబాద్: ఓ వైపు కోస్తాంధ్ర ప్రజలు తుఫానుతో కకాలవిలమై బాధపడుతుంటే కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు చేపట్టడమేమిటని కంటోన్మెంటు శాసనసభ్యుడు శంకరరావు విమర్శించారు. నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం జిల్లాలో తీవ్ర తుఫాను వచ్చి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో తుఫాను బాధిత జిల్లా నెల్లూరులోనే ఉన్న జగన్ వారిని ఆదుకోవడానికి చూడటం కాకుండా ఓదార్పు చేపట్టడమేమిటని ప్రశ్నించారు.

తనను పార్టీవారే అణగదొక్కుతున్నారని ఆయన చెప్పడాన్ని తప్పుబట్టారు. తనకు వ్యతిరేకంగా పార్టీలో ఉన్నవారు తుఫాను గాలుల్లో కొట్టుకు పోతారన్న జగన్ మాటలకు ఆయన స్పందించారు. తుఫాన్ గాలికి కొట్టుకుపోయేది మేం కాదని జగనే త్వరలో తుఫాన్ గాలిలో కొట్టుకు పోతాడని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+