ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలవరాన్ని రాజకీయం చేసి అడ్డుకుంటే ఊరుకోం: చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
ఏలూరు: పోలవరాన్ని రాజకీయం చేసి అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి హెచ్చరించారు. పోలవరాన్ని అడ్డుకోవాలని చూస్తే ప్రజారాజ్యం పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళన చేపడుతామన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించే వరకు ప్రజారాజ్యం ఉద్యమిస్తుందన్నారు. ఇప్పటికే కేంద్రానికి పోలవరానికి జాతీయ హోదా కల్పించాల్సిందిగా పార్టీ తరఫున లేఖ రాశామన్నారు.

కేంద్రం నుండి వరద విపత్తు నిధులు రాబట్టడంలో మన రాష్ట్ర పార్లమెంటు సభ్యులు చేతకానివారిగా ఉండిపోయారని చిరంజీవి విమర్శించారు. వారి చేతకానితనం వల్లనే కేంద్రం నుండి నిధులు రావడం లేదని అన్నారు. కళ్లముందే ఇంత భారీస్థాయిలో వరదలు వచ్చి, గ్రామాలకు గ్రామాలు నీటిలో మునిగిపోతుంటే ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందన్నారు. రైతులు వేసిన పంటలన్నీ నీటిలో కొట్టుకుపోవటంతో వారు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X