మన రాజకీయ నేతలపై బరాక్ ఒబామా ద్వేషం పెంచారా?
మన రాజకీయ నాయకులు మాతో ఎందుకు సులభంగా కలిసిపోరని ట్విట్టర్ లో భారతీయులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గతంలో ఇందిరా గాంధీ, ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఆదివాసీలతో కలిసి నృత్యాలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఆ ఫొటోలు మనకు ఇప్పటికీ దొరుకుతాయి. అదే ఆఖరు కావచ్చు. అయితే, తమ అడుగులకు మడుగులొత్తాలని, వారి మాటలకు అనుగుణంగా మనం ఆడాలని రాజకీయ నాయకులు ఇప్పుడు కోరుకుంటున్నారు.
ఆ తర్వాత ఒబామా సెయింట్ జేవియర్ కళాశాలకు వెళ్లారు. టౌన్ హాల్ మీటింగ్స్ విషయంలో బిల్ క్లింటన్, ఒబామాలకు వెన్నతో పెట్టిన విద్య. ఇండియన్ యూనివర్శిటీలో భారత్ లో మీడియా, ప్రేక్షకులు, పౌరులు ఆసక్తిగా చూడడానికి ముందుకు వచ్చారు. మిషెల్లీ ప్రారంభోపన్యాసం చేశారు. ఒబామాను చాలా కష్టమైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాలని ఆమె విద్యార్థులకు సూచించారు. సెయింట్ జేవియర్ కళాశాలలో ఒబామా 8 ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చినట్లు కనిపిస్తుంది. కానీ ఆయన వందలాది ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఒబామాను అలా ఎందుకు భావించాలంటే మన రాజకీయ నాయకులు అటువంటి దాన్ని ఇష్టపడరు. ఎన్నికల సమయంలో మాత్రమే వాళ్లు దగ్గరికి వస్తారు. సమస్యలపై విన్నవించుకోవడానికి కూడా అందుబాటులో ఉండరు. టౌన్ హాల్ మీటింగ్ తర్వాత పెద్ద సంఖ్యలో ప్రజలతో ఒబామా కరచాలనం చేశారు. ఆయన భద్రతా సిబ్బంది దూరాన్ని పాటించారు. బ్రాండ్ బిల్డింగ్ ప్రాసెస్ లో వాళ్లు జోక్యం చేసుకోలేదు. భారత సెక్యురిటీ సిబ్బంది రాజకీయ నాయకులకు, ప్రజలకు మధ్య సంభాషణను, పరస్పర కలయికను అడ్డుకుంటారు. పాశ్చాత్య, భారత రాజకీయ నాయకులతో కలిసి విషయంలో కూడా మన భారతీయలం కూడా భిన్నంగా ప్రవర్తిస్తామా, కావచ్చు.