పాలమూరు జిల్లాలో ప్రేమోన్మాదిని ఊరేగించి చెప్పులతో కొట్టిన గ్రామస్థులు

తనను ప్రేమించకపోతే ముఖంపై యాసిడ్ పోస్తానని సత్తార్ ఆ బాలికను వేధిస్తూ వస్తున్నాడు. ఆ బెదిరింపులకు భయపడిన బాలిక కొన్నాళ్లు హైదరాబాదులోని తన బంధువుల ఇంట్లో తలదాచుకుంది. చదువు పాడవుతుందనే ఉద్దేశంతో ఆ బాలిక తిరిగి గ్రామానికి వచ్చింది. దీంతో అతను మళ్లీ వేధించడం మొదలు పెట్టాడు. ఆ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు, గ్రామస్థులకు చెప్పింది. దీంతో గ్రామస్థులు అతడ్ని చితకబాదారు. అతనితో పాటు మరో ఇద్దరు ఆకతాయిలు కూడా ఉన్నారని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. సత్తార్ గ్రామంలో ఆకతాయిగా తిరుగుతుంటాడని గ్రామస్థులు చెప్పారు.












Click it and Unblock the Notifications