కొడుకును బండకేసి బాది, కిరోసిన్ పోసి కాల్చి చంపిన తండ్రి

Nizamabad
నిజామాబాద్: తన కన్న కొడుకును అతి కిరాకతంగా చంపిన తండ్రి ఉదంతం నిజామాబాద్ జిల్లా బాడ్సి గ్రామంలో జరిగింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాడ్సి గ్రామానికి చెందిన నారాయణ తన 11 నెలల కొడుకును బండకేసి బాది, ఆ తర్వాత అతని ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి చంపాడు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. తాగిన మైకంలో నారాయణ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

భార్య సావిత్రితో తాగి వచ్చి నారాయణ నిత్యం గొడవ పడుతూ వస్తున్నాడు. రాత్రి కూడా భార్యాభర్తలు గొడవ పడ్డారు. ఈ గొడవతో భయపడిన సావిత్రి ఇంటి నుంచి పారిపోయింది. ఆ సమయంలో నారాయణ కుమారుడిని హత్య చేశాడు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు నారాయణను అదుపులోకి తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+