లగడపాటి ఫిట్టింగ్: ఆంధ్ర లాయర్ల బాహాబాహీ, ఘర్షణ

Andhra Lawyers
మచిలీపట్నం: ఆంధ్ర న్యాయవాదుల మధ్య మంగళవారం తీవ్ర ఘర్షణ జరిగింది. ఆంధ్ర న్యాయవాదుల ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) సమావేశంలో న్యాయవాదులు బాహాబాహీకి దిగారు. హైకోర్టు బెంచ్ కోసం ఆందోళనను ఖరారు చేయడానికి ఏర్పాటైన జెఎసి సమావేశంలో న్యాయవాదుల మధ్య తీవ్ర విభేదాలు చెలరేగింది. లాయర్లు వాగ్యుద్ధానికి దిగారు. ఆందోళనలను విరమించాలనే గుడివాడ లాయర్ రెడ్డి ప్రతిపాదనపై తీవ్ర గందరగోళం చేలరేగింది. కృష్ణా జిల్లా లాయర్లు ఆందోళన విరమించాలని అభిప్రాయపడుతున్నారు. లాయర్ల ఆందోళనపై కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సుముఖంగా లేకపోవడమే కారణమని అంటున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చే వరకు హైకోర్టు బెంచ్ కోసం ఆందోళనను ఆపేయాలని ఆయన అభిప్రాయపడుతున్నారు.

ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల న్యాయవాదులు మంగళవారం సమావేశానికి హాజరయ్యారు. ఆందోళన వల్ల యువ న్యాయవాదులు ఉపాధి కోల్పోతున్నారని, క్లయింట్లకు ఇబ్బంది కలుగుతోందని, అందువల్ల ఆందోళన విరమించాలని ఒక వర్గం వాదించగా, మరో వర్గం ఆ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. హైకోర్టు వద్ద తెలంగాణ లాయర్ల ఆందోళన హింసాత్మకంగా మారడం వల్లనే ప్రభుత్వం దిగి వచ్చిందని, ఆందోళన చేయకపోతే డిమాండ్ ను నెరవేర్చుకోవడం సాధ్యం కాదని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. ఈ స్థితిలో సమావేశం రసాభాసగా మారడంతో భోజన విరామం కోసం సమావేశాన్ని వాయిదా వేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+