హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ తో ఇబ్బంది లేదు: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావుతో భారతీయ జనతా పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట శాసనసభ్యుడు జి.కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం కిషన్ రెడ్డి భాజపా ఆధ్వర్యంలో తెలంగాణ కోసం చేపట్టిన సత్యాగ్రహంలో పాల్గొన్నారు. తెరాస, భాజపా రెండు పార్టీలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పోరాటం చేస్తున్నాయన్నారు.

తెలంగాణ కోసం భాజపా ఆధ్వర్యంలో డిసెంబర్ 9వ తేదిన ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి చిదంబరం ఇంటిని ముట్టడిస్తామని చెప్పారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణను ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో హైదరాబాద్ ఒక ప్రాంతమని చెప్పారు. తెలంగాణ వచ్చే వరకు భాజపా ఉద్యమిస్తుందన్నారు.

సీమాంధ్ర ప్రజలు తెలంగాణకు వ్యతిరేకంగా లేరని ఆయన అన్నారు. స్వప్రయోజనాలకే పెద్దపీట వేసే రాజకీయనాయకులు మాత్రమే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ సాధించే వరకు ఐక్యకార్యాచరణ సమితి(జెఏసి)లో కొనసాగుతామని ఆయన అన్నారు. 2014 ఎన్నికలే లక్ష్యంగా భాజపా పని చేస్తుందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X