హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రతన్ టాటాకు ముఖ్యమంత్రి రోశయ్య లేఖ: పరిశ్రమలు స్థాపించాలని విజ్ఞప్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు మంగళవారం లేఖ రాశారు. పెట్టుబడులు పెడితే సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఉత్తరకోస్తాలో టైటానియం రిఫైనరీకి అవసరమైన భూమిని కేటాయించేందుకు సానుకూలమని ముఖ్యమంత్రి రోశయ్య వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కడైనా తాము భూమిని కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు.

వాహన పరిశ్రమ స్థాపనకు అనంతపురం, కడప జిల్లాల్లో భూమి కేటాయిస్తామని ముఖ్యమంత్రి లేఖలో వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో ఏర్పాటుచేస్తున్న లెదర్‌ పార్క్‌లో టాటా అనుబంధ పరిశ్రమలు నెలకొల్పాలని ఆయన లేఖలో విన్నవించారు. ఇటీవల రతన్ టాటాతో కలిసి రోశయ్య ఓ సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X