వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం ప్రాజెక్టులో జాప్యంపై ఆంధ్ర కాంగ్రెసు ఎంపీలు గరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై కాంగ్రెసు ఆంధ్ర పార్లమెంటు సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్చించడానికి జెడి శీలం నివాసంలో కాంగ్రెసు ఆంధ్ర పార్లమెంటు సభ్యులు బుధవారం రాత్రి సమావేశమవుతున్నారు. పోలవరం ప్రాజెక్టుపై వివరణ కోరుతూ కేంద్ర పర్యావరణ మంత్రి జైరాం రమేష్ రాష్ట్రానికి లేఖ రాసిన నేపథ్యంలో కాంగ్రెసు ఆంధ్ర పార్లమెంటు సభ్యుల్లో కదలిక వచ్చింది. పోలవరం ప్రాజెక్టు మూత పడవచ్చుననే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తే అన్ని అడ్డంకులు వాటంతటవే తొలగిపోతాయని వారు భావిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంలో కొన్ని ముళ్లున్నాయని, ఆ ముళ్లు తొలగిపోతాయని జెడి శీలం అన్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రక్రియ కొనసాగుతోందని, గత 30 ఏళ్లలో ఏ ప్రాజెక్టుకు కూడా దేశంలో జాతీయ హోదా ఇవ్వలేదని, ఈ స్థితిలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రక్రియ వెంటనే కావడం అంత సులభం కాదని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. జాతీయ హోదా లభిస్తే కేంద్రం నుంచి ప్రాజెక్టుకు 15 వేల కోట్ల రూపాయలు వస్తాయని, అలా వస్తే దేశంలోనే అలా సాధించిన ఘనత తమకు దక్కుతుందని ఆయన అన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు రెండేళ్లలో అన్ని అనుమతులు వస్తాయని, అప్పుడు దానికి జాతీయ హోదా కల్పించే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X