వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుంభకోణాలపై అట్టుడికిన పార్లమెంటు ఉభయ సభలు, వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Parliament
న్యూఢిల్లీ: భారీ అవినీతి, కుంభకోణాలపై పార్లమెంటు ఉభయ సభలు బుధవారం అట్టుడికాయి. ప్రతిపక్షాల తీవ్ర గందరగోళం సృష్టించడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. కామన్ వెల్త్ క్రీడలు, టెలికం 2-జి స్పెక్ట్రమ్, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేశాయి. సభలు సమావేశం కాగానే బిజెపి నేతృత్వంలోని ప్రతిపక్షాలు ప్రశ్నోత్తరాల సమయాన్ని అడ్డుకుంటూ నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకెళ్లారు. దీంతో తొలుత పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.

తిరిగి సమావేశమైన తర్వాత మంత్రి రాజాను తొలగించాలని, స్పెక్ట్రమ్ కుంభకోణంపై జెపిసి విచారణకు ఆదేశించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో మరోసారి గందరగోళం చెలరేగింది. దీంతో సభలు గురువారంనాటికి వాయిదా పడ్డాయి. రాజాపై ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. అశోక్ చవాన్, సురేష్ కల్మాడీలకు ఉద్వాసన పలికినా ఫలితం లేకపోయింది. ప్రతిపక్షాలు దాంతో సంతృప్తి చెందలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X