నాంపల్లి కోర్టులో లొంగిపోయిన సత్యం రామలింగరాజు
రామలింగరాజుకు సుప్రీంకోర్టులో వేసిన రెండు పిటిషన్లలోను చుక్కెదురయ్యింది. అంతకుముందు హైకోర్టు రామలింగరాజుకు బెయిలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దానిని సవాల్ చేస్తూ సిబిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు బెయిలుకు గల కారణాలు చూపించాలని రామలింగరాజును ఆదేశించింది. ఆయన ఇచ్చిన కారణాలకు సంతృప్తి చెందని కోర్టు బెయిలును నిరాకరించింది. కేసు విచారణ కోసం కోర్టులో హాజరు కావాలని ఆయనను ఆదేశించింది. 8 తారీకున నాంపల్లి కోర్టులో హాజరయిన రామలింగరాజు బెయిలు పొడగింపు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. రామలింగరాజుతో పాటు ఆరుగురి నిందితులను విచారించాలని కోర్టు ఆదేశించింది.
Comments
Story first published: Wednesday, November 10, 2010, 11:07 [IST]