హైటెక్కు బాబు టక్కు టమారామా?: దుమ్మెత్తిపోసిన సాక్షి

చంద్రబాబు రైతుల కోసం తాను పోరాడుతానంటున్నారని, వరదల ప్రాంతాల్లోకి వెళ్లి అన్నదాతలపై అపారప్రేమను కురిపిస్తున్నారని, కానీ సగటు రైతు మాత్రం పాత విషయాలను మరవలేదని, వ్యవసాయం వల్ల ఒనగూరేదేమీ ఉండదన్న చంద్రబాబు పాలనను, వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన వైఎస్ పాలనతో పోల్చుకుంటున్నారని సాక్షి వ్యాఖ్యానించింది. కరెంటు చార్జీలు తగ్గించాలని, మద్దతు ధరలు కావాలని అడిగినవారిపై క్రూరంగా కాల్పులు జరిపిన బాబును తలుచుకుంటేనే ఇప్పుడు రాష్ట్రంలోని రైతుల గుండెల్లో బాంబులు పేలుతున్నాయని, కరువుతో పొలాల్లో నెర్రెలు వచ్చి రైతు దుఃఖటిల్లినా రుణాల మీదా వడ్డీ మాఫీ విషయాన్ని ఆలోచించని బాబు ఇప్పుడు పావలావడ్డీ మీద మాట్లాడుతుండడంపై నివ్వెరపోతున్నారని సాక్షి విమర్శించింది.












Click it and Unblock the Notifications