సోనియా గాంధీకి ఫిర్యాదు: వైయస్ జగన్ పై పెరుగుతున్న ఒత్తిడి

తనపై సోనియాకు ఫిర్యాదు చేయడం, తన అనుచరుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చర్యకు పార్టీ నాయకత్వం సిద్ధపడడం వంటి కారణాలతో వైయస్ జగన్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న నాయకులు తమ పరిధిలోకి వచ్చేవారయితే, వారిపై పిసిసి వెంటవెంటనే చర్యలు తీసుకుంటోంది. మరోవైపు, ఎఐసిసి సభ్యురాలు కొండా సురేఖను అధిష్టానం పక్కన పెట్టినట్లే. కొండా సురేఖను, మారెప్పను ఎఐసిసి సదస్సుకు ఆహ్వానించకపోవడాన్ని బట్టి వైయస్ జగన్ కు అధిష్టానం వ్యతిరేకంగానే ఉందనే విషయం స్పష్టమైంది. ఓదార్పు యాత్ర ద్వారా దీర్ఘ కాలం సాగి, ఆ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిద్దామని భావించిన వైయస్ జగన్ కు అంతకన్నా ముందుగానే చెక్ పెట్టేందుకు పార్టీ అధిష్టానం సమాయత్తమవుతున్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications