వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైపాల్ రెడ్డిని సిఎం పదవికి ఎగదోస్తున్న సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jaipal Reddy
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా రోశయ్యను మార్చాలని కూడా వారు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రిని మారుస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయని అంటున్నారు. డిసెంబర్ 31వ తేదీ తర్వాత పరిస్థితులను అదుపు చేయాలంటే ముఖ్యమంత్రి మారాల్సిందేనని వారు వాదిస్తున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్టీ అధిష్టానానికి ఓ రహయ్స నివేదికను అందించారని ప్రచారం జరుగుతోంది.

ముఖ్యమంత్రిగా మద్దతు ఉంటుందని చెప్పడానికే సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు బుధవారం రాత్రి జెడి శీలం నివాసంలో జరిగిన సమావేశానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు జైపాల్ రెడ్డిని ఆహ్వానించినట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో జైపాల్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు నంది ఎల్లయ్య, ఖాన్ పాల్గొన్నారు. మిగతా తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు రాలేదు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించడానికి సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ప్రధానంగా ముఖ్యమంత్రి మార్పుపైనే చర్చ జరిగినట్లు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి మార్పు వార్తాకథనాలపై మాట్లాడడానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ గురువారం తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో నిరాకరించారు. ఆ విషయం తనకు తెలియదని, తాను వరద బాధితులను పరామర్శించడానికి ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు. జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా తెలంగాణపై డిసెంబర్ తర్వాత తలెత్తే ఉద్యమాల ఉధృతిని తగ్గించవచ్చుననేది సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు ఎత్తుగడగా భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X