గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోశయ్య తుమ్మితే ఊడే ముక్కు, జగన్ కే సమర్థత: అంబటి రాంబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
గుంటూరు: ముఖ్యమంత్రి కె రోశయ్య తుమ్మితే ఊడే ముక్కు అని కాంగ్రెసు బహిష్కృత నేత, కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ మద్దతుదారు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడే ముఖ్యమంత్రి మార్పు ఉండదని, డిసెంబర్ 31వ తేదీన శ్రీకృష్ణ కమిటీ నివేదికను బట్టి మార్పులు ఉంటాయని ఆయన గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ జగన్ కే ప్రాంతాలకు అతీతంగా పార్టీని ఏకతాటిపై నడిపించే సత్తా ఉందని ఆయన అన్నారు. రోశయ్యను తప్పించి వైయస్ జగన్ కు ముఖ్యమంత్రి పదవి ఇస్తారనే భ్రమలో తాము లేమని ఆయన చెప్పారు. 2014వరకు మాత్రం ముఖ్యమంత్రిగా రోశయ్య ఉండబోరని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగల కార్యకర్తగా సుదీర్ఘకాలం పనిచేసిన చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పీసీసీ క్రమశిక్షణ సంఘం సస్పెండ్ చేయడం, పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసి బయటకు నెట్టడం వెనుక కొందరు పెద్దల కుట్ర దాగుందని ఆయన అన్నారు. జగన్ వ్యతిరేకవర్గంగా ఏర్పడిన వీహెచ్ హనుమంతరావు, కె.కేశవరావు, మధుయాష్కీ, డీఎస్ తదితరుల కుట్ర ఫలితంగానే భాస్కరరెడ్డిపై చర్యలు చేపట్టినట్లు తెలుస్తోందన్నారు.

ఓదార్పుపై ఏఐసీసీ స్పందించకున్నా, పీసీసీ మాత్రం దివంగత వైఎస్‌ఆర్‌ను స్మరిస్తున్న నేతలను, జగన్‌కు తోడుగా ఉంటున్న వారిని ప్రత్యేకంగా వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు. చిత్తూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రూ. రెండు కోట్లు, అమెరికా ఉద్యోగం ఆఫర్ ఇచ్చినా కాంగ్రెస్‌ను వీడని చరిత్ర చెవిరెడ్డిదని చెప్పారు. ఈ వ్యవహారంలో చంద్రబాబుకు ప్రత్యక్ష శత్రువుగా ముద్రపడిన చెవిరెడ్డి 2004లో 40 క్రిమినల్ కేసులు ఎదుర్కొని రెండు నెలలు జైలు జీవితం గడిపారని తెలిపారు.

గ్రూప్-1 పరీక్షలప్పుడు ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ఉద్యమకారులతో కలిసి కళాశాలల్లోకి దౌర్జన్యంగా వెళ్లి పేపర్‌లను బయటకు తేవడం ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదా..? అని ఆయన అంబటి ప్రశ్నించారు. ఎంపీ మధుయాష్కీ నేరుగా గవర్నర్‌పై విమర్శలు చేసినా, రాష్టప్రార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీపై దామోదర్‌రెడ్డి ఆరోపణలు చేసినా అధిష్టానం మౌనం వహించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. సొంత పార్టీ మంత్రి పొన్నాలపైనే అవినీతి ముద్ర వేస్తూ గవర్నర్‌ను కలిసిన వారిపై కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు చర్యలు చేపట్టదని నిలదీశారు. అధిష్టానం చెవులు పెద్దవి, కళ్లు చిన్నవిగా చేసుకుని వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. ఏఐసీసీ ప్లీనరీకి మారెప్ప, కొండా సురేఖలకు ఆహ్వానం పంపకపోవడంలో వ్యూహం నడిపిన పెద్దలెవరో తమకు తెలుసన్నారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై చర్యలపై ఏఐసీసీ, పీసీసీ పునస్సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X