కె చంద్రశేఖర రావుపై దుమ్మెత్తి పోసిన దేవేందర్ గౌడ్

కాంగ్రెసు పార్టీ ఎజెండాను అమలు చేసే దళారీగా కెసిఆర్ పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రావతరణ నుంచి ఇప్పటి వరకు కాంగ్రెసు తెలంగాణను మోసం చేస్తోందని, తెలంగాణ ప్రజలను మభ్య పెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటోందని, తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షను నెరవేర్చడం లేదని, స్వార్థ రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకుని తెలంగాణ ప్రజలను మోసం చేస్తోందని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం కాకుంటే రెచ్చగొట్టి 600 మంది విద్యార్థుల చావుకు ఎందుకు కారణమయ్యావని ఆయన కెసిఆర్ ను ప్రశ్నించారు.
కాంగ్రెసు, కెసిఆర్ కలిసి చేస్తున్న కుట్రను అర్థం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే ఎవరు బలపరుస్తారో, ఎవరు వ్యతిరేకిస్తారో తేలిపోతుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా, ఆర్థికంగా బలపడడమే కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ పై తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంతం మరో నాయకుడు కడియం శ్రీహరి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ ను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications