వైయస్ తెలంగాణ ద్రోహి: కాంగ్రెసు నాయకుడు దామోదర్ రెడ్డి

గత శాసనసభ ఎన్నికలలో సైతం ఆయన తెలంగాణలో పోలింగ్ అయిపోగానే సీమాంధ్ర ప్రాంతంలో తెలంగాణకవ వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. కర్నూల్ సభలో తెలంగాణకు వెళ్లాలంటే వీసాలు కావాలా అంటూ ప్రశ్నించి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకున్నారన్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ రెడ్డి కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఫ్లకార్డులు ప్రదర్శించిన విషయాన్ని గుర్తు చేశాడు. అయితే ఇప్పటికైనా జగన్ తెలంగాణకు అనుకూలమని బహిరంగంగా ప్రకటిస్తే వైయస్ ఫోటో పెట్టడానికి సిద్ధమని ప్రకటించారు.












Click it and Unblock the Notifications