హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాటా అడిగితే లాఠీఛార్జా!: డిజిపిపై హరీష్ రావు పైర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Osmania University
హైదరాబాద్: ప్రభుత్వం ఎస్ఐ రాత పరీక్షలను వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉస్మానియా ఐక్యకార్యాచరణ సమితి(ఓయూజేఏసి) సోమవారం డిజిపి కార్యాలయాన్ని ముట్టడించింది. ప్రభుత్వానికి, డిజిపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ ఫ్రీజోన్ అంశం తేలేవరకు ఎస్ఐ రాత పరీక్షలు నిర్వహించరాదని వారు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేశారు, మరికొందరిని తరిమి కొట్టారు. అరెస్టు చేసిన విద్యార్థులను నాంపల్లి పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు.

కాగా ఎస్ఐ రాతపరీక్షలను వెంటనే రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేసింది. తెలంగాణ పోస్టులను న్యాయపరంగానే అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 14ఎఫ్ క్లాజును వెంటనే తొలగించాలని ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా ప్రాంతానికి అన్యాయం జరిగితే పోరాడి సాధించుకుంటామన్నారు. మాస్ కాపీయింగ్ కు, భారీ అక్రమాలకు ఎస్ఐ పరీక్షలు నిదర్శనమన్నారు.

సిద్దిపేట తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు మెదక్ లో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు న్యాయమైన పోస్టులను అడిగితే లాఠీలతో కొట్టడమేమిటని ప్రశ్నించారు. విద్యార్థులపై లాఠీచార్జీకీ వెంటనే డిజిపి సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని శాసనసభ తీర్మానం చేసిందనీ, దానిని అమలు చేయటం చట్ట విరుద్ధమా అని ప్రశ్నించారు. కాంగ్రెసు నేతలు, శాసనసభ్యులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X