వైయస్ జగన్ సాక్షికి కాంగ్రెసు నేత వి హనుమంతరావు వార్నింగ్

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పత్రిక పెడుతుంటే తామంతా సంతోషించామని, కాంగ్రెసుకు ఓ పత్రిక వస్తుందని అనుకున్నామని, కానీ కాంగ్రెసుకు, సోనియాకు వ్యతిరేకంగా వార్తలు రాయడానికి పెట్టినట్లు ఉందని ఆయన అన్నారు. యుపిఎ అంటేనే కుంభకోణాల ప్రభుత్వంగా మారిందని సాక్షి పత్రిక వ్యాఖ్యానించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తొలుత తమకు, ముఖ్యమంత్రి రోశయ్యకు వ్యతిరేకంగా వార్తలు రాసిన సాక్షి దినపత్రిక ఇప్పుడు సోనియాకు వ్యతిరేకంగా రాస్తోందని ఆయన అన్నారు. వైయస్ జగన్ కుంభకోణాలను బయటపెట్టే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఆ కుంభకోణాలపై తాము ప్రత్యేకంగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని, పార్టీ అధిష్టానానికి అన్నీ తెలుసునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications